సినీ దర్శకుడి హఠాన్మరణం

Telugu Director Bikshapathi Dies Of Heart Attack - Sakshi

సాక్షి, ములుగు రూరల్‌: ములుగు జిల్లాలోని దేవగిరిపట్నం గ్రామానికి చెందిన సినీ దర్శకుడు ఇరుసాడ్ల భిక్షపతి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. భిక్షపతి ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో ఉద్యోగం చేస్తూ సినీ రంగంపై ఉన్న మక్కువతో హైదరాబాద్‌ వచ్చి ‘కన్నుల్లో నీ రూపమే’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమా అనుకున్న రీతిలో ఆడకపోవడంతో అప్పటి నుంచి దేవగిరిపట్నంలో జీవనం కొనసాగిస్తున్నారు. ఆదివారం గుండెపోటు రావడంతో కన్నుమూశారు. మృతుడికి వృద్ధ తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

చదవండి: Tamannaah: నార్మల్‌ కావడానికి రెండు నెలలు పట్టింది

మాజీ భార్యపై జానీ డెప్​ తప్పుడు ప్రచారం!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top