విజయవాడలో సాయి ధరమ్ తేజ్ సందడి
సాక్షి, విజయవాడ: సినీ హీరో సాయి ధరమ్ తేజ్ నగరంలో సందడి చేశారు. వాంబేకాలనీలోని ‘అమ్మా ఆదరణ సేవా ఓల్డేజ్ హోమ్’ను ఆయన గురువారం సందర్శించారు. కాగా ఈ వృద్ధాశ్రమానికి మెగా మేనల్లుడు గతంలో ఆరు లక్షలు విరాళం అందజేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ నిమిత్తం విజయవాడకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ అక్కడికి వెళ్లారు. దీంతో ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. అభిమానుల కోరిక మేరకు వృద్ధాశ్రమానికి తన వంతు సాయం చేయడమే గాకుండా స్నేహితులతో కూడా విరాళం ఇప్పించినట్లు తెలిపారు.(చదవండి: మెగా ఫ్యామిలిలో మళ్లీ పెళ్లి బాజాలు..)
అదే విధంగా అందరి సహకారంతో మున్ముందు మరిన్ని సహాయ కార్యక్రమాలు చేపడతానని పెద్ద మనసు చాటుకున్నారు. ఇక తన సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘కరోనా అన్లాక్ ప్రక్రియలో భాగంగా సినిమా హాళ్ళకు అనుమతి ఇవ్వటం హర్షణీయం. త్వరలో నేను నటించిన సినిమా సోలో బ్రతుకే సో బెటర్ విడుదల కానుంది. పైరసీని తరిమికొట్టి థియేటర్లలో సినిమాలు చూసి ఆదరించండి’’ అని విజ్ఞప్తి చేశారు.(చదవండి: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మెగా మేనల్లుడు)
సంబంధిత వార్తలు