Mahesh Babu: ఆ యాడ్ కోసం మహేశ్బాబు పారితోషికం ఎంతో తెలుసా?
సూపర్ స్టార్ మహేశ్బాబు ఏది చేసినా పర్ఫెక్ట్గానే ఉంటుంది. అది యాడ్ అయినా, సినిమా అయినా! తాజాగా ఆయన మౌంటెన్ డ్యూ యాడ్లో నటించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా నుంచి కిందకు బైక్ రైడ్ చేస్తూ కనిపించాడు మహేశ్. అయితే ఈ ప్రకటన కోసం హీరో బాగానే డిమాండ్ చేసినట్లు సమాచారం. తెలుగులో ఏడాది పాటు మౌంటెన్ డ్యూ సాఫ్ట్ డ్రింక్ను ప్రమోట్ చేసేందుకు ఆయన ఏకంగారూ. 12 కోట్ల పారితోషికం తీసుకున్నారట!
గతేడాది కూడా ఈయనే సదరు బ్రాండ్ను ప్రమోట్ చేశాడు. కానీ అప్పుడు ఏడు కోట్లు తీసుకున్నాడు. ఈసారి మాత్రం మరో ఐదు కోట్ల రూపాయలు ఎక్కువగా తీసుకున్నట్లు తెలుస్తోంది. యాడ్లో నటించడమే కాకుండా సోషల్ మీడియాలోనూ ఆ వాణిజ్య ప్రకటనను, మౌంటెన్ డ్యూ కంపెనీకి సంబంధించిన బ్రాండ్ను ప్రమోట్ చేయడం తప్పనిసరి.
అందుకే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే మహేశ్బాబు రూ.12 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సూపర్ స్టార్ పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది సమ్మర్ కానుకగా మే 12న విడుదల కానుంది. మరోవైపు ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్తో సినిమా చేస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.