అమిత్‌ షాకు థ్యాంక్స్‌ చెప్పిన కంగన

Kangana Ranaut Will Get Security From Central Government - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య నేపథ్యంలో ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ బాలీవుడ్‌ నటీనటులపై బంధుప్రీతి (నెపోటిజం)వ్యాఖ్యలతో సంచలనం సృష్టించింది. ఇటీవల శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, కంగనా రనౌత్‌కు మధ్య మాటల యుద్ధం నెలకొంది. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ముంబైలో అడుగుపెట్టవద్దని సంజయ్‌ రౌత్‌ బెదిరించడంపై కంగనా రనౌత్‌ స్పందిస్తు సంజయ్‌ రౌత్‌ బెదిరింపుల నేపథ్యంలో ముంబై నగరం తనకు ఇప్పుడు పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లాగా కనిపిస్తోందని పేర్కొన్నారు.

ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్న కంగనా సెప్టెంబర్‌ 9న ముంబై రానుంది. దీంతో కంగనాకు వై కేటగిరీ బధ్రత కల్పిస్తు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తనకు బధ్రత కల్పించడం పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు కృతజ్ఞతలు(థ్యాంక్స్‌) చెప్పింది. అమిత్‌ షా తనను గౌరవించారని, ఆయన తనను కొన్ని రోజుల తర్వాత మొంబైకు వెళ్లమని సలహా ఇచ్చుండే వారని, కానీ ఆయన ఆ సలహా ఇవ్వలేదని తెలిపింది. దేశ మహిళను అమిత్‌ షా గౌరవించారని పేర్కొంది. అయితే బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్‌ తీసుకుంటారని కంగనా రనౌత్‌ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top