క్రైమ్‌ తెచ్చిన క్రేజ్‌..హీరోయిన్‌గా దూసుకెళ్తున్న త్రిషా ముఖర్జీ

Interesting Facts About Trishna Mukherjee - Sakshi

నటీనటుల ప్రతిభకు కొదవ లేదు. ఆ కళను ప్రదర్శించే అవకాశాలే కరవు. అందుకే, చాలామంది అభినయ కళాకారులు ఒక్క చాన్స్‌ .. ఒకే ఒక్క చాన్స్‌ కోసం.. ఆ చాన్స్‌తో నిరీక్షిస్తుంటారు.  త్రిషా ముఖర్జీకి  మాత్రం ఆ అవసరం రాలేదు. నటనారంగంలోకి అడుగుపెట్టగానే అవకాశం వరించింది. క్రేజీ క్రైమ్‌ కథనాల హీరోయిన్‌గా దూసుకుపోతోంది.

కోల్‌కతాలో పుట్టి, పెరిగిన త్రిష.. హైదరాబాద్‌లోని ఐసీఎఫ్‌ఏఐ యూనివర్సిటీలో చదివింది. 

 కాలేజీ రోజుల్లోనే మోడల్‌గా మారి పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. 

 2012లో ‘లైట్‌ షేడ్‌ రెడ్‌’ బెంగాలీ సినిమాతో  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

వెండితెరకు మొదట పరిచయమైనా.. బుల్లితెర ఆమెను ఎక్కువగా ఆదరించింది. వరుస సీరియల్‌ అవకాశాలు.. వాటిల్లో ఆమె కనబరచిన  నెగెటివ్‌ షేడ్‌ తన ఫేట్‌నే మార్చేసింది. 

 ‘క్రైమ్‌ పెట్రోల్‌’ సీరియల్‌తో పాపులర్‌ అయిపోయింది.  తర్వాత చేసిన ‘కోడ్‌ రెడ్‌’, ‘సావధాన్‌ ఇండియా’, ‘క్రాక్‌ డౌన్‌’తో బిజీ అయిపోయింది.  

మరెన్నో తెలుగు, తమిళ సీరియల్స్‌లో నటిస్తూ క్రేజీ క్రైమ్‌ కథనాల హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. 

ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రసారమవుతోన్న ‘మధ’ సిరీస్‌తో అలరిస్తోంది. 

క్రైమ్‌ కథనాలకే ప్రాముఖ్యం ఇస్తారెందుకు అని చాలా మంది నన్ను ప్రశ్నిస్తుంటారు. నిజానికి, ఆ కథనాలే నన్ను ఎంచుకుంటున్నాయని నా ఫీలింగ్‌. కమర్షియల్‌ సినిమాల్లోనూ నటిస్తా. 
– త్రిషా ముఖర్జీ 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top