ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత
పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాను ఇంకొక పది సంవత్సరాలు అయినా ఎవరం మర్చిపోలేం. నటన, దర్శకత్వం, మ్యూజిక్ అన్నీ సమపాలల్లో ఉంటే అచ్చం ఈ సినిమా లాగే ఉంటుందేమో.. ఈ సినిమా విజయంలో ఎడిటింగ్కు ఉన్న స్థానాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఎన్నో గుర్తుండిపోయే సినిమాలకు ఎడిటింగ్ చేసి పేరు తెచ్చుకున్న కోలా భాస్కర్ ఇక లేరు. గత కొంతకాలంగా నోటి క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు.
కాగా తెలుగు, తమిళంలో పలు హిట్ చిత్రాలకు కోలా భాస్కర్ ఎడిటర్గా పనిచేశారు. తెలుగులో పవన్ కళ్యాణ్ ‘ఖుషి’తో పాటు తమిళంలో విజయ పోకిరి చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఇక 20 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉన్న భాస్కర్ తొలిసారి నిర్మాతగా మారి ఆయన కుమారుడు బాలకృష్ణను పరిచయం చేస్తూ మాలయ్ నెరత్తు మయక్కం అనే సినిమాను తీశారు. ఇదే తెలుగులో నన్ను వదిలి నీవు పోలేవులేగా డబ్ అయ్యింది. కాగా భాస్కర్ మరణ వార్త తెలుసుకున్న తెలుగు, తమిళ సినిమా ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేశారు.