Vadhu Katnam: మహిళల సంఖ్య తగ్గిపోతే...!
Bhargava Gottimukkala New Movie: శ్రీహర్ష, ప్రియ, రఘు, కవిత, ఆర్యన్, రేఖ, కౌశల్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘వధుకట్నం’. భార్గవ గొట్టిముక్కల దర్శకత్వంలో షేక్ బాబు సాహెబ్ (బాబుషా) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న థియేటర్స్లో విడుదల కానుంది. భార్గవ మాట్లాడుతూ – ‘‘భ్రూణ హత్యలు పెరిగిపోయి, మహిళల సంఖ్య తగ్గిపోతే అప్పుడు ఎలాంటి చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయి? అనే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు.
‘‘ఇటీవల ఓ పెళ్లిలో పెళ్లి కుమార్తెకు వరుడు కట్నం ఇచ్చి వివాహం చేసుకున్నాడు. అమ్మాయిల సంఖ్య తగ్గిపోతే ఇలాంటివే జరుగుతాయి. మహిళలను సంరక్షించుకోవాలనే సందేశంతో ఈ సినిమా తీశాను. ఈ సినిమాలో ఒక పాట కూడా రాశాను’’ అన్నారు షేక్ బాబు. ‘‘మా చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు యాభై థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు డిస్ట్రిబ్యూటర్ రాజేంద్ర.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు