‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు

ఏర్పాట్లను పరిశీలిస్తున్న 
డీఈఓ రాధాకిషన్‌ - Sakshi

డీఈఓ రాధాకిషన్‌

వెల్దుర్తి(తూప్రాన్‌): ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌ పేర్కొన్నారు. మండలంలోని కుకునూర్‌, వెల్దుర్తి ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి పరీక్షా కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. తరగతి గదులు, టాయిలెట్స్‌, విద్యుత్‌ సౌకర్యం, తాగునీటి వసతి వంటి మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డీఈఓ వెంట ఎంఈఓ యాదగిరి, నోడల్‌ అధికారి ఉన్నారు.

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top