రాములోరి కల్యాణం చూతము రారండి
మెదక్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయం సీతారాముల కల్యాణానికి సిద్ధమైంది. రంగురంగుల పూలు, స్వాగత తోరణాలతో కల్యాణ వేదిక ముస్తాబైంది. గురువారం ఉదయం 10 గంటలకు కల్యాణ క్రతువు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో రాములోరి పెళ్లి వేడుక జరగనుంది. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ముత్యాల తలంబ్రాలు, పుస్తె మెట్టె లు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. వేడుకకు సుమారు పదివేలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు బండ నరేందర్ తెలిపారు.