మెరుగైన సేవలు అందించాలి

రికార్డులను పరిశీలిస్తున్న 
కమిషనర్‌ శ్వేతా మహంతి 
 - Sakshi

రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్‌ శ్వేతామహంతి

శివ్వంపేట(నర్సాపూర్‌): ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్‌ శ్వేతామహంతి అన్నారు. మంగళవారం సాయత్రం శివ్వంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. రికార్డులు సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతీ మంగళవారం మహిళల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక చికిత్స కేంద్రాలను మహిళలు వినియోగించుకునే విధంగా సిబ్బంది కృషి చేయాలన్నారు. గర్బిణులకు పోషకాహారంపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఎంపీపీ కల్లూరి హరికృష్ణ కమిషనర్‌కు పలు వినతులు అందజేశారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా నూతన శివ్వంపేట పీహెచ్‌సీకి అదనపు భవనం మంజూరుతో పాటు 24 గంటల పాటు వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టాలని, సిబ్బంది సంఖ్య పెంచాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్యధికారి చందునాయక్‌, తహసీల్దార్‌ శ్రీనివాసాచారి, ఎంపీడీఓ నవీన్‌కుమార్‌, వైద్యులు సాయిసౌమ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top