పేపర్‌ లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

వినతి పత్రం అందజేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు   - Sakshi

అదనపు కలెక్టర్‌కు ఎస్‌ఎఫ్‌ఐ వినతి

మెదక్‌ కలెక్టరేట్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన పరీక్షల పేపర్‌ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సంతోష్‌ అన్నారు. ఈమేరకు మంగళవారం మెదక్‌ కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ రమేశ్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సంతోష్‌ మాట్లాడుతూ టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గ్రూపు 1 పరీక్ష పేపర్‌ కూడా లీకై నట్లుగా వార్తలు వస్తున్నాయని, ఏన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులను పేపర్‌ లీకేజీ నిరాశ నిస్పృహలకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలు వెచ్చించి, విలువైన సమయం కేటాయించి లక్షలాది నిరుద్యోగులు ఉద్యోగాలకు కోచింగ్‌ తీసుకుంటున్నారన్నారు. బోర్డులో ఇంత జరుగుతున్నా కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిన బోర్డు చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి, బోర్డు కార్యదర్శి, సభ్యుల పాత్రపై విచారణ జరిపించాలన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి చైర్మన్‌ను తొలగించి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌, ఉపాధ్యక్షుడు జగన్‌, సహాయ కార్యదర్శి అజయ్‌ పాల్గొన్నారు.

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top