‘ఎస్సీ వర్గీకరణపై కేంద్రం మోసం’

చిన్నశంకరంపేట(మెదక్‌): ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలిచి అధికారంలోకి వచ్చాక మోసం చేసిన బీజేపీని నమ్మవద్దని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్‌ మాదిగ అన్నారు. సోమవారం ఖాజాపూర్‌ నుంచి చిన్నశంకరంపేట వరకు సంగ్రామయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మాదిగలు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకులు యాదగిరి, మురళి, ఎంఈఎప్‌ నాయకులు డప్పు నర్సింహులు, మండల నాయకులు శ్రీనివాస్‌, స్వామి, రాములు, శ్రీనివాస్‌, రాజు, సాగర్‌ పాల్గొన్నారు.

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top