కాళేశ్వరంతో సస్యశ్యామలం

మాట్లాడుతున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి - Sakshi

నిజాంపేట(మెదక్‌): కాళేశ్వరం కాలువలతో మండలంలో 19 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్‌ సమస్యలు తొలగిపోయాయని అన్నారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జి ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పద్మాదేవేందర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మండల కేంద్రం నుంచి నస్కల్‌ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, రైతు బంధు జిల్లా డైరెక్టర్‌ భాస్కర్‌రావు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top