సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

వరి పంటను పరిశీలిస్తున్న అధికారులు  - Sakshi

మెదక్‌ రూరల్‌: వరికి చీడపీడలు ఆశించకుండా రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశకుమారి సూచించారు. శుక్రవారం మండలంలోని అవుసులపల్లిలో వరి పొలాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చీడపీడల నివారణకు అవసరమైన సస్యరక్షణ చర్యలను వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం వరికి అగ్గి, మెడవిరుపు తెగులు ఎక్కువగా సోకుతుందన్నారు. దీని నివారణకు అధికారులు తెలిపిన మందులు పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ సందీప్‌, రైతులు సిద్దిరాములు, రాములు తదితరులు పాల్గొన్నారు.

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top