ఒకటో తేదీన జీతాలు చెల్లించాలి

మెదక్‌ కలెక్టరేట్‌: ఉపాధ్యాయులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని యూఎస్‌పీసీ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా స్టీరింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఖజానా అధికారి (డీటీఓ) కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు సంగయ్య, వెంకట్రామిరెడ్డి, శ్రీనివాస్‌రావు, పద్మారావు మాట్లాడుతూ.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని ఉద్యమం చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ఉద్యోగుల భవిష్య నిధి, జీవిత బీమా, మెడికల్‌ బిల్లులు కూడా చెల్లించకపోవడం సరికాదన్నారు. మూడు రోజుల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్‌ బిల్లుల ఆమోదానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో 28న యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్‌ నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ యాదగిరి, ఉపాధ్యాయదర్శిని ఎడిటర్‌ శశిధర్‌రెడ్డి, జిల్లా నాయకులు రాజేంద్రప్రసాద్‌, మధుసూదన్‌రెడ్డి, రాజయ్య, అల్వాల రమేశ్‌, టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా నాయకులు శీతల్‌ సింగ్‌, రవీందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top