క్షయ నిర్మూలనకు కృషి చేయండి
మెదక్జోన్: క్షయ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా క్షయ వ్యాధి ప్రోగాం అధికారి డాక్టర్ మాధురి పేర్కొన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండు వారాలకు పైగా దగ్గు ఉంటే వెవెంటనే తెమడ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. క్షయ అంటే బయపడవద్దని, చికిత్స ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చని వివరించారు. కరోనా కేసులు మళ్లీ నమోదవుతున్న తరుణంలో అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి సూచించారు. కార్యక్రమంలో వైద్యులు మణికంఠ, సుశీల్, విజయేందర్, ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, పారా మెడికల్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.