ఆంక్షల కోడ్‌.. | - | Sakshi
Sakshi News home page

ఆంక్షల కోడ్‌..

Dec 8 2025 7:41 AM | Updated on Dec 8 2025 7:41 AM

ఆంక్ష

ఆంక్షల కోడ్‌..

● ఉల్లంఘిస్తే ఎన్నికలకు దూరం ● అవసరమైతే క్రిమినల్‌ కేసు ● నేరం రుజువైతే జైలు శిక్ష ● శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా బీఎన్‌ఎస్‌–163 (144 సీఆర్‌పీసీ యాక్ట్‌) అమలు చేస్తారు. ● నలుగురి కన్నా ఎక్కువ మంది ఒక చోట ఉండకూడదు. ● అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు, ప్రచారం నిర్వహించొద్దు. కర్రలు, ఇతర మారణాయుధాలతో తిరగొద్దు. ● పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలి. ఆ తర్వాత ప్రచారం చేస్తే కోడ్‌ ఉల్లంఘన కింద పరిగణిస్తారు. ● అన్ని రకాల సోషల్‌ మీడియా (సామాజిక మాధ్యమాల్లో) ప్రత్యర్థులను విమర్శిస్తూ పోస్టులు పెట్టడంపై ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తారు. ● బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసిన అక్రమంగా నిల్వ ఉంచిన, ఓటర్లకు పంచుతూ పట్టుబడిన కేసు నమోదు చేస్తారు. అలాగే 34–ఏ ఎకై ్సజ్‌ చట్టం 1968 కింద జరిమానా, శిక్ష విధిస్తారు.

అడపిల్ల పెళ్లికి.. రూ.5,016 పేదల అంత్యక్రియలకు నగదు ఆలయ నిర్మాణానికి రెండు గుంటల భూమి హామీ

నిర్మల్‌చైన్‌గేట్‌: పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు అలర్ట్‌గా ఉండాలి. లేదంటే ఎన్నికలకు దూరమయ్యే పరిస్థితి రావొచ్చు. ఎందుకంటే ఎన్నికల ప్రవర్తన నియమావళిని(కోడ్‌) ఉల్లంఘించిన వారిని పోటీ చేయకుండా నిషేధించే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఎన్నికల సంఘం వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయొచ్చు. నేరం రుజువైతే జైలు శిక్ష కూడా పడొచ్చు. అందుకే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నిబంధనల మేరకు నడుచుకోవాల్సిందే.

కోడ్‌ ఎందుకంటే..

ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు రూపొందించింది. దీనినే ‘మోడర్‌ ఆఫ్‌ కోడ్‌ కండక్ట్‌ (ఎంసీసీ) అంటారు. ఏదైనా రాజకీయ పార్టీ, అభ్యర్థి ఈ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకుంటుంది.

నిబంధనలు ఇవే..

ఇతర హామీలతో

ప్రకటించిన మేనిపెస్టో

బాండ్‌ పేపర్‌తో శ్రీధర్‌గౌడ్‌

నగదు రూ.50 వేలకు మించి ఉండొద్దు

రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి రూ.50 వేల నగదు మాత్రమే తన వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండి దానికి సంబంధించిన సరైన పత్రాలు చూపలేకపోతే పోలీసులు సీజ్‌ చేస్తారు. తక్కువ మొత్తంలో లభించిన డబ్బు ను రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. ఎక్కువ ఉంటే ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి సదరు డబ్బును కోర్టులో జమ చేస్తారు.

సర్పంచ్‌ అభ్యర్థి బాండ్‌పేపర్‌

ఖానాపూర్‌: బాండ్‌పేపర్‌పై రాసిన మేనిఫెస్టోతో మండలంలోని బీర్నంది పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థి మూల శ్రీధర్‌గౌడ్‌ వినూత్న ప్రచారం చేపట్టాడు. గ్రామంలోని యాదవ కులస్తులకు మల్లన్నస్వామి ఆలయ నిర్మాణానికి రెండు గుంటల భూమి విరాళంగా ఇస్తానని, రూ.50 విలువ గల బాండ్‌ పేపర్‌పై లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. ఇదే తరహాతో ఎన్నికల మేనిఫెస్టోలో పలు హామీలు ప్రకటించారు. ప్రతీ ఆడపిల్ల పెళ్లికి రూ.5016, పేదలు మరణిస్తే రూ. 5 వేలు ఇస్తానని తెలిపారు.

ఆంక్షల కోడ్‌..1
1/3

ఆంక్షల కోడ్‌..

ఆంక్షల కోడ్‌..2
2/3

ఆంక్షల కోడ్‌..

ఆంక్షల కోడ్‌..3
3/3

ఆంక్షల కోడ్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement