పులి సంచరిస్తుంది.. జాగ్రత్తగా ఉండండి
కోటపల్లి: మండలంలోని పంగిడిసోమారం, బద్దంపల్లి అటవీప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. పా దముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు అ ప్రమత్తం అయ్యారు. చామనపల్లి, పంగిడిసోమవా రం, బద్దంపల్లి, బుస్నాయి సమీప గ్రామాల్లో ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో డప్పు చా టింపు వేయించారు. పులికి నష్టం కలిగించొద్దని అవగాహన కల్పించారు. శుక్రవారం చామన్పల్లి అ టవీ ప్రాంతంలో బానయ్యకు చెందిన ఎద్దుపై దాడి చేయగా.. చూసిన పశువుల కాపరి భయంతో చెట్టె క్కి తలదాచుకున్నట్లు సమాచారం. బద్దంపల్లి అట వీప్రాంతంలో పాదముద్రలు గుర్తించిన అధికారులు పంగిడిసోమారం అటవీప్రాంతంలోకి వచ్చే ఆ వకాశం ఉందని, గ్రామాల్లో ప్రజలు పులికి ఎలాంటి హాని తలపెట్టినా కఠినచర్యలు తీసుకుంటామని సె క్షన్ ఆఫీసర్ రాజేశ్, బీట్ ఆఫీసర్ రాజేశ్ తెలిపారు.


