అంజనీతండాలో మనస్తాపంతో ఒకరు.. | - | Sakshi
Sakshi News home page

అంజనీతండాలో మనస్తాపంతో ఒకరు..

Nov 26 2025 6:33 AM | Updated on Nov 26 2025 6:33 AM

అంజనీతండాలో మనస్తాపంతో ఒకరు..

అంజనీతండాలో మనస్తాపంతో ఒకరు..

నర్సాపూర్‌(జీ): మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంజనీతండా గ్రామానికి చెందిన చవాన్‌ గణేశ్‌ (50) రెండేళ్లుగా తన కుటుంబంతో ఉపాధి నిమిత్తం కుస్లీ గ్రామంలో నివాసముంటున్నాడు. సోమవారం అతడి కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో గొడవ జరిగింది. ఈక్రమంలో చవాన్‌ గణేశ్‌ ఇంటినుంచి బయకువెళ్లి రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం గాలించారు. మంగళవారం కుస్లీ గ్రామ శివారులోని పత్తి చేనులో విగతజీవిగా పడి ఉన్నాడు. మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి మరణించి ఉంటాడని అతడి భార్య చవాన్‌ లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్‌ తెలిపారు.

విద్యుదాఘాతంతో డ్రైవర్‌ మృతి

కాగజ్‌నగర్‌రూరల్‌: కాగజ్‌నగర్‌ మండలంలోని పెంచికల్‌పేట్‌ ప్రధాన రహదారి పక్కన టిప్పర్‌లోంచి కంకర డంపు చేస్తున్న డ్రైవర్‌ రాములు (43) విద్యుత్‌షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు.. చింతగూడ గ్రామానికి చెందిన కొట్రంగి రాములు తన సొంత టిప్పర్‌లో ఇటుక బట్టీల యజమానికి కంకర సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇతర ప్రాంతం నుంచి కంకర లోడ్‌తో వచ్చి చింతగూడ మూలమలుపు వద్ద డంపు చేస్తున్నాడు. ఈ క్రమంలో పైనున్న విద్యుత్‌ వైర్లకు టిప్పర్‌ హైడ్రాలిక్‌ తగలడంతో విద్యుత్‌ షాక్‌తో రాములు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఈజ్‌గాం ఎస్సై ఘటనా స్థలాన్ని సందర్శించారు. రాములు భార్య చిలుకుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు.

విద్యుత్‌ తీగలకు తగిలిన టిప్పర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement