అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
● 2నెలల్లో ఇండోర్ స్టేడియం అందుబాటులోకి తేవాలి
● రాష్ట్ర ఎకై ్సజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని ముఖ్య కూడళ్లలో సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ జి.రవినాయక్తో కలిసి పట్టణంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వద్ద పనుల ఆలస్యంపై అధికారులు, కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను మోడల్గా తీర్చిదిద్దాలని సూచించారు. ఇండోర్ స్టేడియం పనులు రెండు నెలల్లోగా పూర్తి చేయాలని, ఇది జాతీయస్థాయి క్రీడల నిర్వహణకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ హాస్టల్ను ఏర్పాటుచేయాలన్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాపోటీలకు హాజరయ్యే క్రీడాకారులు బస చేసేందుకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్ రామ్లక్ష్మణ్, డీవైఎస్ఓ శ్రీనివాస్, పీఆర్ ఈఈ నరేందర్రెడ్డి, మున్సిపల్ డిప్యూటీ ఇంజినీర్ బెంజిమన్ తదితరులు పాల్గొన్నారు.