వర్షపు నీటిని ఒడిసిపట్టాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): వర్షపు నీటిని నిల్వ చేయడం ప్రతిఒక్కరి బాధ్యత అని కలెక్టర్ రవినాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టనున్న క్యాచ్ ద రెయిన్ వాల్పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్బ జలాలను పెంచేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని, వాన నీళ్లను ఒడిసి పట్టి నిల్వ చేసుకొని పొదుపు వాడుకోవాలన్నారు. నీళ్లను వృథా చేస్తే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసిన వాళ్లం అవుతామన్నారు. జిల్లా యువజన కోఆర్డినేటర్ కోటానాయక్ పాల్గొన్నారు.