భగవద్గీతను అందరూ చదవాలి | - | Sakshi
Sakshi News home page

భగవద్గీతను అందరూ చదవాలి

Dec 2 2025 9:18 AM | Updated on Dec 2 2025 9:18 AM

భగవద్గీతను అందరూ చదవాలి

భగవద్గీతను అందరూ చదవాలి

హన్మకొండ కల్చరల్‌: శ్రీకృష్ణభగవానుడు ఉపదేశించిన భగవద్గీత అందరూ చదవాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్రశర్మ కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్‌ వరంగల్‌ అధ్వర్యంలో సోమవారం హనుమకొండలోని టీటీ డీ కల్యాణమండపంలో గీతాజయంతి వేడుకలు ఘ నంగా నిర్వహించారు. ప్రోగ్రాం ఇన్‌చార్జ్‌ రామిరెడ్డి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ము ఖ్యఅతిథిగా గంగు ఉపేంద్రశర్మ, అతిథులుగా ఆర్యవైశ్య సంఘం నాయకులు గట్టు మహేశ్‌బాబు, వికా స తరంగిణి జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బచ్చు రాధాకృష్ణ హాజరై జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా 6వ తగగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న విద్యార్థులకు భగవద్గీత శ్లోకాల కంఠస్థపోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. న్యాయనిర్ణేతలుగా తెన్నేటి వసుంధర, వలస పైడి, మచ్చమ్మ, దయాకర్‌స్వామి, వేదాంతం శ్రీదేవి, దుర్గ వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement