
చెత్తాచెదారం తొలగింపు..
కేసముద్రం: మున్సిపాలిటీ పరిధిలో పలు చోట్ల సైడ్ కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగించి శుభ్రం చేశారు. డ్రెయినేజీలు సరిగా లేకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మంగళవారం సాక్షి దినపత్రికలో ‘కంపు..కంపు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి ఆదేశాలతో మున్సిపాలిటీ పరిధి కిష్టాపురం, కేసముద్రంవిలేజ్, చైతన్యనగర్, రేకులతండా, అమీనాపురంతోపాటు పలు చోట్ల సైడ్ కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగించి, శుభ్రం చేశారు.

చెత్తాచెదారం తొలగింపు..