జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల యాజమాన్యాలు తమ బస్సుల్లో ఏఐఎస్–63 ప్రమాణాలు విధిగా పాటించాలి. భద్రత లోపాలు ఉన్న బస్సులకు నోటీసులు జారీ చేసి వారం గడువు ఇస్తున్నాం. ఆ తర్వాత కూడా లోపాలు సరిచేయకపోతే మోటార్ వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. బడి బస్సుల భద్రతలో వాటి యాజమాన్యాలు కూడా సమాన బాధ్యత వహించాలి. రాబోయే రోజుల్లో ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయి.
– శాంతకుమారి, డీటీసీ


