
‘రైతుసేవ’లు మూత
ఆలూరు రూరల్: అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన రైతుసేవా కేంద్రాలు మూతపడ్డాయి. ఆలూరు మండలంలోని హత్తిబెళగల్, కమ్మరచేడు, కురుకుంద, మనేకుర్తి, కురువళ్లి, హులేబీడు గ్రామాల్లో ఈ కేంద్రాలు పనిచేయడం లేదు. ఇటీవల ఈ కేంద్రాలకు బదిలీపై వచ్చిన ఎవ్వరూ చేరకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ఖరీఫ్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేసి అవసరమైన ఎరువులు అందుబాటులో లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. అయినా రైతుసేవా కేంద్రాలను అధికారులు అందుబాటులోకి తీసుకురావడం లేదు.
డిగ్రీ కళాశాలలోకి వర్షపునీరు
పాణ్యం: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలోని తరగతి గదుల్లోకి శనివారం వర్షపునీరు వచ్చి చేరింది. జోరు వాన కురవడం, కళాశాలకు కేటాయించిన గదులు శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ దుస్థితి నెలకొంది. తరగతి గదిలోకి వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

‘రైతుసేవ’లు మూత