ఏపీపీఎస్‌సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

అధికారులతో సమీక్షిస్తున్న డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు - Sakshi

కర్నూలు(సెంట్రల్‌): ఏప్రిల్‌ 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించే ఏపీపీఎస్‌సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కో ఆర్డినేటర్‌, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం ఆయన తన చాంబరులో పరీక్షకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలులోని సనత్‌నగర్‌ డిజిటల్‌ అయాన్‌ కేంద్రంలో ఆయుర్వేదిక్‌, హోమియోపతి, యూనానీకి సంబంధించిన మెడికల్‌ ఆఫీసర్‌, అలాగే ఆయా విభాగాలకు సంబంధించిన ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ బేస్డ్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. దూపాడులోని కేవీ సుబ్బారెడ్డి ఆయాన్‌ డిజిటల్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుకు ఆన్‌లైన్‌ బేస్డ్‌ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఉదయం 9.30 నుంచి 12 గంటలకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతలుగా పరీక్షలు జరుగుతాయన్నారు.

Read latest Kurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top