ఏఐ తరగతులు పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఏఐ తరగతులు పకడ్బందీగా నిర్వహించాలి

Nov 14 2025 8:02 AM | Updated on Nov 14 2025 8:02 AM

ఏఐ తరగతులు పకడ్బందీగా నిర్వహించాలి

ఏఐ తరగతులు పకడ్బందీగా నిర్వహించాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: ఏఐ తరగతులు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌, డీఈవో దీపక్‌ తివారి అన్నారు. మండలంలోని తేలిగూడ, అంకుసాపూర్‌ పాఠశాలలను తనిఖీ చేసి, మధ్యాహ్న భోజనం, తరగతి గదులు, ఏఐ బోధన తీరు, రికార్డులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించా రు. ఆయన వెంట విద్యాశాఖ అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి శ్రీనివాస్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement