
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆదివారం సువర్ణ పుష్పార్చన, అభిషేకం వేడుకలను కనులపండువగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పల్లకీ సేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశాక స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను వైభవంగా జరిపించారు. కాగా, తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. గోదావరిలో పుణ్య స్నానాలను ఆచరించి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.