యరగేరాను తాలూకాగా ప్రకటించండి | - | Sakshi
Sakshi News home page

యరగేరాను తాలూకాగా ప్రకటించండి

Jul 11 2025 12:39 PM | Updated on Jul 11 2025 12:39 PM

యరగేరాను తాలూకాగా ప్రకటించండి

యరగేరాను తాలూకాగా ప్రకటించండి

రాయచూరు రూరల్‌: రాయచూరు నుంచి 25 కి.మీ దూరంలోని యరగేరాను తాలూకా కేంద్రంగా ప్రకటించాలని యరగేరా తాలూకా పోరాట సమితి అధ్యక్షుడు నిజాముద్దీన్‌ డిమాండ్‌ చేశారు. జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ప్రజలకు అనుకూలమయ్యే విధంగా తాలూకాను ఏర్పాటు చేయడానికి సౌకర్యాలున్నాయన్నారు. యరగేరా వద్ద 256 ఎకరాల్లో ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం ఉందన్నారు. రాయచూరు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు జాతీయ రహదారి– 167 ఉందన్నారు. యరగేరా పరిధిలో 19 గ్రామ పంచాయతీలు, 78 గ్రామాలు ఉన్నాయన్నారు. 2020 నుంచి యరగేరాను తాలూకా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రికి జిల్లాధికారి నితీష్‌ ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో బసవరాజ్‌, మహబూబ్‌ పటేల్‌, విద్యానందరెడ్డి, తాయప్ప, మహ్మద్‌ రఫీలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement