ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో సోమవారం ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించారు. ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధి అంటు వ్యాధి కాదని వ్యాధి బారిన పడిన వారు పోషకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి ఆస్మా అప్షిన్ మాట్లాడుతూ.. ఎయిడ్స్ ఉందని ఎలాంటి ఆందోళనకు గురికావద్దని సూచించారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఎయిడ్స్ నిర్మూలనపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ తీశారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్వో హిమబిందు మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధి ఎలా వ్యాపిస్తుందో వివరించారు. జాగ్రత్తలు తెలియజేశారు.
ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన


