నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Dec 1 2025 9:36 AM | Updated on Dec 1 2025 9:36 AM

నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

కృష్ణానదిపై హైలెవల్‌ బ్రిడ్జి, ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన

800 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు

నారాయణపేట/ మక్తల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మక్తల్‌లో పర్యటించనున్నారు. వాకిటి శ్రీహరి మంత్రి అయిన తర్వాత సీఎం మక్తల్‌కు రావడం ఇదే తొలిసారి కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు రూ.558 కోట్లతో పెద్దఎత్తున అభివృద్ధి పనులను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. జూరాల– కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణానదిపై రూ.123 కోట్లతో హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం, మక్తల్‌ మండలం గొల్లపల్లి శివారులో 25 ఎకరాల భూమిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు రూ.210 కోట్లతో మక్తల్‌– నారాయణపేట నుంచి నాలుగు లైన్ల రోడ్డు పనులు ప్రారంభించనున్నారు. అలాగే మక్తల్‌– పేట – కొడంగల్‌ పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.20 లక్షల చొప్పున పరిహారం చెక్కులను సీఎం చేతులమీదుగా అందించనున్నారు. అనంతరం బీసీ బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు సీఎం మక్తల్‌ పర్యటన నేపథ్యంలో సభావేదిక వద్ద ఏర్పాట్లను ఆదివారం నారాయణపేట కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఎస్పీ వినీత్‌ పరిశీలించారు. ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని, సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐ, ఎస్‌ఐలు మొత్తం 800 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement