బెస్ట్‌ ‘అన్‌’ అవైలబుల్‌ | - | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ ‘అన్‌’ అవైలబుల్‌

Nov 1 2025 8:12 AM | Updated on Nov 1 2025 8:12 AM

బెస్ట

బెస్ట్‌ ‘అన్‌’ అవైలబుల్‌

కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం..

బీఏఎస్‌ స్కీంలో విద్యార్థులను యాజమాన్యాలు పాఠశాలకు రానివ్వకపోతే కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపి సమస్యను కలెక్టర్‌ వివరించాం. ఆమె ఆదేశాల మేరకు విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. చాలా పాఠశాలల్లో ప్రభుత్వం ఫీజులు ఇవ్వలేదని కారణంతో తల్లిదండ్రుల నుంచి పుస్తకాలు, షూ, హాస్టల్‌ తదితర అవసరాల కోసం డబ్బులు వసూలు చేశారు. వాటిపై జిల్లా అధికారులు కమిటీ వేసి వాటిని పేద విద్యార్థులకు తిరిగి ఇప్పించాలి. – కమలాకర్‌,

ఎంఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్‌నగర్‌

పుస్తకాలు ఇవ్వలేదు..

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాలలో బీఏఎస్‌ స్కీంలో మా పాప చదువుతుంది. ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని కచ్చితంగా పుస్తకాలకు డబ్బులు కడితేనే ఇస్తామని యాజమాన్యం చెప్పడంతో సొంతంగా డబ్బులు కట్టాల్సి వచ్చింది. జిల్లా అధికారులు స్పందించి డబ్బులు వెనక్కి ఇప్పించాలి.

– రమేష్‌, విద్యార్థి తండ్రి

మా దృష్టికి వస్తే పరిష్కరిస్తాం..

రెండు వారాల క్రితం బీఏఎస్‌ స్కీంలో విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని కలెక్టర్‌ దృష్టికి రావడంతో వెంటనే పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాం. తప్పిస్తే మా దృస్టికి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. తల్లిదండ్రులు ిసమస్యను మా దృష్టికి తెస్తే పరిష్కరిస్తాం. – సునీత,

ఎస్సీ సంక్షేమశాఖ అధికారి, మహబూబ్‌నగర్‌

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఆర్థికంగా వెనకబడిన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన ప్రైవేటు విద్య అందించే లక్ష్యంతో ప్రభుత్వం బెస్టు అవైలబుల్‌ స్కీం (బీఏఎస్‌) ప్రవేశపెట్టింది. ప్రతి సంవత్సరం 1 నుంచి 5వ తరగతుల్లో అడ్మిషన్లు కల్పిస్తూ.. 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా విద్యను ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో అందిస్తుంది. రెసిడెన్షియల్‌ పద్ధతి లేదా డే స్కాలర్‌ విధానంలో కూడా చదువుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో మొత్తం 50 పాఠశాలల్లో మొత్తం 3,380 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.46 వేల వరకు ఖర్చు చేస్తుంది. 1 నుంచి 5 తరగతుల వరకు చదివే డే స్కాలర్స్‌కు పాఠశాల చదువుతో పాటు పుస్తకాలు, షూ, నోటుబుక్స్‌ ఇవ్వాలి. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వారికి హాస్టల్‌ వసతి కల్పించాల్సి ఉంటుంది. అయితే గడిచిన మూడేళ్లుగా వీటికి సంబంధించిన ఫీజులను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.10 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఇటీవల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిరసన చేపట్టగా.. బకాయిల్లో 25 శాతం నిధులు విడుదల చేసింది.

అవగాహన లేకపోవడంతో..

బీఏఎస్‌ ద్వారా ఎన్నికై న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పథకంపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో యాజమాన్యాలు ఎలా చెబితే అలా ఫీజులు చెల్లిస్తున్నారు. నోటుబుక్స్‌, పాఠ్యపుస్తకాలు, హాస్టల్‌, పాఠశాల, షూ, అడ్మిషన్‌ ఫీజు ఇలా అన్నీ ఉచితంగా అందించాల్సి ఉంది. కానీ, నిధులు ప్రభుత్వం విడుదల చేయలేదన్న సాకు చూపి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అనేక పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో పెద్దఎత్తున ఫీజులు వసూలు చేశారు. ముఖ్యంగా చాలా వాటిలో కేవలం పాఠశాలలను నిర్వహించేందుకు మాత్రమే అనుమతులు ఉండగా, వాటిలోనే హాస్టల్స్‌ సైతం కొనసాగిస్తున్నారు. చాలా పాఠశాలల్లో విద్యార్థులకు మూడు పూటలా పెట్టాల్సిన భోజనంలోనూ నాణ్యతా ప్రమాణాలు ఉండడం లేదని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీటిని ఏమాత్రం పట్టించుకోని సంక్షేమ శాఖ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జిల్లా బీఏఎస్‌ ఎస్సీ ఎస్టీ

పాఠశాలలు విద్యార్థులు విద్యార్థులు

మహబూబ్‌నగర్‌ 12 806 356

వనపర్తి 8 532 84

నాగర్‌కర్నూల్‌ 18 1,062 208

నారాయణపేట 1 120 30

గద్వాల 11 442 240

జిల్లాల వారీగా బీఏఎస్‌ పాఠశాలలు, విద్యార్థులు ఇలా..

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నామమాత్రంగానే ప్రైవేటు విద్య వసతి

తల్లిదండ్రుల నుంచే పుస్తకాలు,హాస్టల్స్‌కు డబ్బులు వసూలు

అయినప్పటికీ అరకొర వసతులు, నాణ్యత లేని భోజనం వడ్డింపు

మూడేళ్లుగా నిధులు ఇవ్వనిప్రభుత్వం.. పట్టించుకోని అధికారులు

బెస్ట్‌ ‘అన్‌’ అవైలబుల్‌ 1
1/1

బెస్ట్‌ ‘అన్‌’ అవైలబుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement