ప్రాణాలకు తెగించి.. గ్రేటర్వాసులను రక్షించి..
న్యూస్రీల్
ఆదివారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2025
● కాళేశ్వర ఆలయానికి
రూ.3.30లక్షల ఆదాయం
గ్రేటర్ మహానగరం జలదిగ్బంధమైన వేళ.. మేమున్నామంటూ కదిలారు పోలీసులు, అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బంది. జల విలయాన్ని ఛేదిస్తూ వేలాది మందిని బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్లపైకి వచ్చి సేవలందించారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. బల్దియా కార్మికులు అయితే ఒకవైపు వరద ఉధృతంగా ప్రవహిస్తుంటే మరోవైపు వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా ఎన్పీడీసీఎల్ సిబ్బంది రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించారు. దుప్పట్లు, వాటర్ బాటిళ్లు, ఆహారం పంపిణీ చేసేందుకు స్వచ్ఛందంగా తరలివచ్చారు దాతలు. మానవత్వంతో కదిలివచ్చిన వీరందరి ‘సేవలకు సలాం’ పలుకుతూ ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.
– వరంగల్ అర్బన్/వరంగల్క్రైం/హనుమకొండ/కాజీపేట అర్బన్
గోదావరికి
పంచరత్న హారతి
కాళేశ్వరం: కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో పంచరత్నాల్లో భాగంగా మొదటి రోజు త్రివేణి సంగమ గోదావరి వద్ద అర్చకులు పంచరత్నహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం వీఐపీ ఘాటులోని హారతి వేదిక వద్ద అర్చకులు హారతినిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
55 శాతం బొగ్గు ఉత్పత్తి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో గడిచిన అక్టోబర్ మాసంలో 55శాతం బొగ్గు ఉత్పత్తి చేసినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. అక్టోబర్ మాసానికి సంబంధించి నిర్దేశించిన బొగ్గు ఉత్పతి లక్ష్యాలలో 4.23లక్షల టన్నులకుగాను 2.33 టన్నులు 55శాతం, ఓబీ వెలికితీతలో 52.00 లక్షల క్యూబిక్ మీటర్లగాను 32.92లక్షల క్యూబిక్ మీటర్లతో 63శాతం ఓవర్ బర్దన్ వెలికి తీసినట్లు చెప్పారు. అధిక వర్షాలతో ఉత్పత్తికి విఘాతం కలిగిందని, అనుకున్న లక్ష్యాలు సాధించలేక పోయామన్నారు. ఉత్పత్తి లక్ష్యాలు సాధించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.
పర్యాటక ప్రదేశాల
టూర్ ప్యాకేజీలు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఆర్టీసీ డిపో నుంచి యాత్రికుల సౌకర్యార్ధం పర్యాటక ప్రదేశాలకు టూర్ ప్యాకేజీలు కేటాయించనున్నట్లు డిపో మేనేజర్ ఇందు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంచారామాలు, అన్నవరం, అరుణాచలం, వైజాగ్ ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ యాత్రలకు భక్తులు, పర్యాటకులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు 97019 67519, 99592 26707 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.
బాల్యవివాహ రహిత
జిల్లానే ధ్యేయం
భూపాలపల్లి రూరల్: బాల్యవివాహ రహిత జిల్లాగా రూపుదిద్దడమే ధ్యేయంగా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది కలిసి పనిచేయాలని జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి ఆదేశించారు. శనివారం జిల్లా ఐసీడీఎస్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మల్లీశ్వరి పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. బాల్య వివాహాలతో కలిగే ఆనర్ధాలపై నవంబర్ 1 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు, గ్రామస్థాయిలో నెల రోజులపాటు.. బాల బాలికలకు, బాల్యవివాహాలు, బాల కార్మికులు, బేటీ బచావో బేటీ పడావో వంటి కార్యక్రమాలపై పాఠశాలలు, కళాశాలల్లో జిల్లాలోని ప్రతి గ్రామం, మండలంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీపీయూ, సఖి, మహిళా సాధికారికత కేంద్రం విభాగాల అధికారులు, సిబ్బంది అనూష, గాయత్రి, కళావతి, మమత, తిరుపతి, సోషల్ కుమార్, ప్రవీణ్, రామ్ చరణ్, సాయిరాం, సురేష్ పాల్గొన్నారు.
వరంగల్ నగరంలో..
ఇటీవల కురిసిన వర్షానికి న్యూరాయపుర
మొత్తం మునిగిపోయింది. కాలనీలోని ఓ వ్యక్తి అనారోగ్యం బారిన పడ్డాడు. కనీసం బయటికి రాలేని పరిస్థితి. ఇంటి చుట్టూ నీళ్లు. సమాచారం అందుకున్న హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీస్సిబ్బంది అతడి ఇంటికి చేరుకున్నారు. బాధితుడిని స్ట్రెచర్పై పడుకోబెట్టి క్షేమంగా బయటికి తీసుకువచ్చారు.
అనంతరం ఎంజీఎంకు తరలించారు.
తనను కాపాడిన పోలీసులకు బాధితుడు
కృతజ్ఞతలు తెలిపాడు.
ఈ ఫొటో చూడండి..
హనుమకొండలోని టీవీ టవర్ కాలనీకి
చెందిన అలేఖ్య గురువారం రాత్రి
అమెరికాకు వెళ్లాల్సి ఉంది. బుధవారం కురిసిన
వర్షానికి ఆమె ఇంటి చుట్టూ వరద. బయటికి
వెళ్లలేని పరిస్థితి. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రోప్ సాయంతో ఆమె ఇంటికి చేరుకున్నారు. అలేఖ్యతోపాటు కుటుంబ సభ్యులకు లైఫ్ జాకెట్లు ధరింపజేసి రోప్ సాయంతో ఇంటిలో నుంచి క్షేమంగా బయటికి తీసుకువచ్చారు. అనంతరం ఆమె
అమెరికా వెళ్లేందుకు హైదరాబాద్
బయలుదేరి వెళ్లింది.
● వరద ప్రభావిత బాధితులకు అండగా నిలిచిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బల్దియా డీఆర్ఎఫ్
● కీలకంగా వ్యవహరించిన కమిషనరేట్ పోలీసులు
● నిరంతర విద్యుత్ సేవల్లో ఎన్పీడీసీఎల్ అధికారులు
● వారి సేవలను ప్రశంసిస్తున్న ముంపు బాధితులు
ప్రకృతి విపత్తుల సమయంలో గ్రేటర్ వరంగల్ మహా నగరాన్ని రక్షించేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) మేమున్నామంటోంది. అత్యవసర సమయాల్లో మెరుపు వేగంతో రంగంలోకి దిగి ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలను రక్షిస్తోంది. తాజా గా మోంథా తుపాను కారణంగా వరంగల్ మహానగరం అతలాకుతలమైంది. ఈనేపథ్యంలో బల్దియా డీఆర్ఎఫ్ సిబ్బంది 30 మంది, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం హైదరాబాద్కు చెందిన ఎస్డీఆర్ఎఫ్, టీజీఎఫ్డీకి సంబంధించిన సుమారు వంద మంది రక్షకులు సేవలందించారు. వరదలో చిక్కుకున్న సుమారు 400 మందిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించి శెభాష్ అనిపించుకున్నారు. వరంగల్ నగరంలోని 45 వరద ప్రభావిత ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ బృందాలు మెరుపు వేగంతో స్పందించాయి. ఆస్తి, ప్రాణ నష్టం, రవాణా సేవలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలందించి అందరి మన్ననలు పొందాయి.
పోలీసుల సేవాభావం..
పలు కాలనీల్లో వరదల్లో చిక్కుకున్న 1,700 మందిని వరంగల్ కమిషనరేట్ పోలీసులు సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేడ్కర్ భవన్లో ఓ వివాహ వేడుక కోసం వచ్చిన సుమారు 150 మంది వరదలో చిక్కుకున్నారు. వారికి ఎలాంటి ప్రమాదం కలగకుండా ఒడ్డుకు చేర్చారు. కాపువాడ, గోకుల్నగర్, టీవీ టవర్ కాలనీ, గోపాల్పూర్ భగత్సింగ్ నగర్ వంటి ప్రాంతాలనుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ఒకదశలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ నేరుగా రంగంలోకి దిగి ట్రాక్టర్పై వరద ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ సహాయక చర్యలను పర్యవేక్షించారు.
విద్యార్థినులకు ఆపన్నహస్తం..
రెండేళ్ల క్రితం 2023, జూలై 27న కురిసిన వర్షానికి హంటర్రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల భవనం మొదటి అంతస్తులోకి వర్షపు నీటితోపాటు పాములు, తేళ్లు వచ్చాయి. భవనం టెర్రాస్పై బిక్కుబిక్కుమంటూ రాత్రి నుంచి ఉదయం వరకు విద్యార్థినులు వేచి చూశారు. అప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ సాయంతో విద్యార్థినులను రక్షించారు. ఈ ఏడాది అక్టోబర్ 29న అదే పరిస్థితి ఎదురైంది. మోంథా తుపాను కారణంగా డిగ్రీ కళాశాల భవనం పూర్తిగా జలమయమైంది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు సుమారు 12 గంటల పాటు విద్యార్థినులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఆపన్న హస్తం కోసం ఎదురు చూశారు. కలెక్టర్ స్నేహ శబరీష్ సారథ్యంలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండు బోట్ల సాయంతో 470 మంది విద్యార్థులను రక్షించి పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. తమను రక్షించిన వారికి విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు.
వరద పోటెత్తినా..
విద్యుత్ పునరుద్ధరణ
వర్షం దంచికొడుతున్నా.. రాత్రింబవళ్లు వినియోగదారులకు కరెంట్ సరఫరాను అందించారు విద్యుత్ సిబ్బంది. నగరం జలదిగ్బంధంలో చిక్కుకున్న సమయంలో విద్యుత్ సబ్ స్టేషన్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగి కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. వరద నీటిలో వెళ్లి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కు సరఫరా నిలిపివేసి ప్రత్యామ్నా య మార్గంలో విద్యుత్ సరఫరా అందించారు. వర్షం, వరద నీటిలో స్తంభం పైకి ఎక్కుతుంటే.. కాళ్లు పట్టు కోల్పోతున్నా.. విద్యుత్ సిబ్బంది తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు.
సల్లగా బతకమని ఆశీర్వదించింది..
సమ్మయ్యనగర్లో ఇళ్లు, చుట్టూ భారీగా వరద నీరు నిలిచిందని అందిన సమాచారంతో వరద నీటిలోకి వెళ్లాను. ఆ ఉధృతికి నాకే భయం వేసింది. కానీ, ధైర్యం చేసుకొని ముందుకు సాగాను. ఓ మహిళను తాడు సాయంతో ఎత్తుకుని బయటకు తీసుకొచ్చాను. ఆమె నన్ను ‘సల్లగా బతుకు’ అని ఆశీర్వదించింది.
– వి.శ్రీకాంత్, డీఆర్ఎఫ్
అటు ట్రాఫిక్, ఇటు రెస్క్యూ..
వర్షం కురుస్తున్నంతసేపు సమస్య తీవ్రత ఉన్న ప్రదేశాల్లో ప్రజలకు తక్షణ సేవలందించాం. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించకుండా చర్యలు తీసుకున్నాం. వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జేసీబీ, ట్రాక్టర్లతో వెళ్లి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాం.
– పునాటి నరసింహారావు,
ఏసీపీ, హనుమకొండ
గర్భిణిని ఒడ్డుకు చేర్చాం..
28వ డివిజన్ హంటర్ రోడ్డులోని సాయినగర్ కాలనీలో గర్భిణి వరదల్లో చిక్కుకుందని తెలియడంతో డీఎఫ్ఓ శంకర్ లింగం ఆదేశాలతో ముందుకు సాగాం. అదే సమయంలో ఏసీపీ శుభం ప్రకాశ్, మట్టెవాడ పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బందితో బయటకు తీసుకొచ్చి ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చాం
– సీహెచ్.అశోక్, డీఆర్ఎఫ్
ఆలయంలో ఉసిరి చెట్టు వద్ద లక్షవత్తులు వెలిగిస్తున్న భక్తులు
కాలసర్పనివారణ పూజలు చేస్తున్న భక్తులు
కాళేశ్వరం: కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తల సందడి నెలకొంది. ఉదయం అర్చకులు మంగళవాయిద్యాలతో గోదావరి వద్దకు తరలి వెళ్లారు. గోదావరి మాతకు పంచరత్నాల్లో భాగంగా పూజలు చేసి హారతినిచ్చారు. కలశాలలో గోదావరి జలాలను తీసుకువచ్చి స్వామివారి గర్భగుడిల్లో జలాభిషేక పూజలు ప్రత్యేకంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి గోదావరి మాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అరటి దొప్పల్లో దీపాలు వదిలారు. ఇసుకతో సైకత లింగాలు చేసి పసుపు, కుంకుమతో పూజించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి, శ్రీసరస్వతి అమ్మవార్ల ఆలయంలో ప్రత్యేకంగా మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. సామూహికంగా సత్యనారాయణ వ్రతాలు చేశారు. ఉసిరి చెట్టు వద్ద మహిళలు ప్రదక్షిణలు చేశారు. లక్షముగ్గులు వేసి, లక్షవత్తులు వెలిగించారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. తాగునీరు అందజేశారు. శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, నవగ్రహాల వద్ద శనిపూజలను భక్తులు అధికంగా నిర్వహించారు. వివిధ పూజలు, లడ్డు ప్రసాదాల ద్వారా ఆలయానికి రూ. 3.30లక్షల ఆదాయం సమాకూరినట్లు ఈఓ మహేష్ తెలిపారు.
ప్రాణాలకు తెగించి.. గ్రేటర్వాసులను రక్షించి..
ప్రాణాలకు తెగించి.. గ్రేటర్వాసులను రక్షించి..
ప్రాణాలకు తెగించి.. గ్రేటర్వాసులను రక్షించి..
ప్రాణాలకు తెగించి.. గ్రేటర్వాసులను రక్షించి..
ప్రాణాలకు తెగించి.. గ్రేటర్వాసులను రక్షించి..
ప్రాణాలకు తెగించి.. గ్రేటర్వాసులను రక్షించి..
ప్రాణాలకు తెగించి.. గ్రేటర్వాసులను రక్షించి..
ప్రాణాలకు తెగించి.. గ్రేటర్వాసులను రక్షించి..
ప్రాణాలకు తెగించి.. గ్రేటర్వాసులను రక్షించి..


