Trending Top 10 News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 న్యూస్
1. ఈసారి భారీ మొత్తంలోనే!.. వాళ్ల ఆస్తులమ్మి మరీ ఉక్రెయిన్కు సాయం
యుద్ధంతో నలిగిపోతున్న ఉక్రెయిన్కు భారీగా సాయం అందించాలనుకుంటోంది అగ్రరాజ్యం అమెరికా. సుమారు 33 బిలియన్ డాలర్ల సాయం ప్యాకేజీ రూపంలో అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. భారత్లో కరోనా వైరస్.. ఇది కచ్చితంగా ఊరట ఇచ్చే విషయమే!
దేశంలో కరోనా వైరస్కు సంబంధించి ఊరట ఇచ్చే విషయం చెప్పింది కేంద్ర పరిధిలోని ఇన్సాకాగ్. మిగతా దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో కరోనా వైరస్కు సంబంధించి చాలా తక్కువ రీకాంబినెంట్ వేరియెంట్లు వెలుగుచూశాయని ప్రకటించింది.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. సీఎం స్టాలిన్ కుమారుడికి భారీ ఊరట
డీఎంకే యువజన విభాగం నేత, ఎమ్మెల్యే ఉదయ నిధి స్టాలిన్కు హైకోర్టులో మరోమారు ఊరట లభించింది. ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను గురువారం న్యాయమూర్తి భారతీ దాసన్ బెంచ్ తోసి పుచ్చింది.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. సీఐతో శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు నిందితుడి సెల్ఫీ
మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్య కుట్ర కేసులో నిందితుడిగా ఉన్న మున్నూరు రవి బుధవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో..ప్రత్యక్షం కావడం కలకలం రేపగా... తాజాగా పేట్బషీరాబాద్ సీఐ రమేష్తో సెల్ఫీ మరో వివాదం అయింది.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. ‘పది’.. పాపమంతా ‘నారాయణ’దే
పదో తరగతి పరీక్షలను రాజకీయం చేసేందుకు, తమ స్వలాభం కోసం నారాయణ విద్యాసంస్థ చేసిన కుట్ర బట్టబయలైంది.తిరుపతిలో తెలుగు కాంపోజిట్ పరీక్ష ప్రశ్నపత్రాలను ఫొటో తీసి వాట్సాప్లో పెట్టిన ప్రధాన నిందితులు నారాయణ సిబ్బందేనని గుర్తించారు.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. ప్రజా సంక్షేమం ఆగదు: సీఎం వైఎస్ జగన్
రాష్ట్రంలో ఎవరు అడ్డుపడినా సంక్షేమం ఆగదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేసే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. కోల్కతా... అదే కథ
ప్రత్యర్థి స్పిన్, పేస్ ధాటికి మాజీ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ మళ్లీ తడబడింది. ఐపీఎల్ సీజన్లో వరుసగా ఐదో పరాజయం చవిచూసింది.ఐపీఎల్ మ్యాచ్లో క్యాపిటల్స్ జట్టు 4 వికెట్లతో కోల్కతా నైట్రైడర్స్పై నెగ్గింది.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. టాలీవుడ్లో మరో విషాదం.. కరెంట్ షాక్తో డైరెక్టర్ మృతి
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది.డైరెక్టర్ పైడి రమేష్ ఓ భవనంపై నుంచి జారిపడి మరణించినట్లు తెలుస్తోంది. ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పైడి రమేష్ నాలుగో అంతస్తులో ఆరేసిన బట్టలు తీస్తుండగా షాక్ కొట్టి కింద పడిపోయినట్లు సమాచారం.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. గ్లోబల్ టెక్ దిగ్గజాలకు సమన్లు
పోటీని అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తున్న ఆరోపణలతో పలు గ్లోబల్ టెక్ దిగ్గజాలకు సమన్లు జారీ కానున్నాయి. ఇందుకు గురువారం పార్లమెంటరీ కమిటీ నిర్ణయాన్ని తీసుకుంది.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. వెండితెర మీద వంటల రాణి
తర్లా దలాల్ 2013లో మరణించింది. కాని వంట అనేసరికి టీవీ చెఫ్గా ఇప్పటికీ ఆమె పేరే గుర్తుకు వస్తుంది. వంటల మీద తర్లా దలాల్ రాసిన 100 పుస్తకాలు దాదాపుకోటి కాపీలు అమ్ముడుపోయాయి.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి