పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై కారు దగ్ధం

- - Sakshi

రాజేంద్రనగర్‌: పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం అర్ధరాత్రి ఓ కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ సమయంలో కారులో ఉన్న ముగ్గురు యువకులు క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సులేమాన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన హరూన్‌ పర్వేజ్‌ (28) తన స్కోడా కారులో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి శనివారం రాత్రి పని నిమిత్తం ఆరాంఘర్‌ వైపు వెళ్తున్నాడు.

పిల్లర్‌ 144 వద్ద పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై కారులో పొగలు రావడంతో కిందకు దిగి పరిశీలిస్తున్నాడు. నిమిషాల వ్యవధిలో కారు మొత్తం మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో పర్వేజ్‌తో పాటు మరో ఇద్దరు యువకులు కారులో ఉన్నారు. విషయం తెలుసుకున్న అత్తాపూర్‌ ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోని మంటలను ఆర్పారు. రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top