భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలి | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలి

Dec 2 2025 7:13 AM | Updated on Dec 2 2025 7:13 AM

భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలి

భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలి

హన్మకొండ: విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. హనుమకొండ న్యూశాయంపేటలోని శ్రీవ్యాస ఆవాసంలో సులక్ష్య సేవా సమితి బాధ్యులు పేద గిరిజన విద్యార్థులకు సోమవారం యూనిఫాం పంపిణీ చేశారు. సీఎండీ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్కూల్‌ యూనిఫాం అందించి మాట్లాడారు. విద్యార్థులు పట్టుదలతో చదువుకుని మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని కోరారు. సులక్ష్య సేవా సమితి అధ్యక్షుడు మండువ సంతోశ్‌, ప్రముఖ ఫిజీషియన్‌ డాక్టర్‌ శివసుబ్రహ్మణ్యం, శ్రీవ్యాస ఆవాసం అధ్యక్షురాలు వసుంధర, కార్యదర్శి శ్రీనివాస్‌, ఎన్పీడీసీఎల్‌ హనుమకొండ టౌన్‌ డీఈ జి.సాంబరెడ్డి, ఎమ్మార్టీ, విజిలెన్స్‌ డీఈ అనిల్‌కుమార్‌, ఏడీఈ ఇంద్రసేనారెడ్డి, ఏఈ అరుణ్‌ పాల్గొన్నారు.

టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement