రేపు వెలగపూడిలో ప్రపంచ జనాభా దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

రేపు వెలగపూడిలో ప్రపంచ జనాభా దినోత్సవం

Jul 10 2025 6:33 AM | Updated on Jul 10 2025 6:33 AM

రేపు

రేపు వెలగపూడిలో ప్రపంచ జనాభా దినోత్సవం

ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్‌, ఎస్పీ

తాడికొండ: ఈనెల 11న తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో ప్రపంచ జనాభా దినోత్సవం జరగనుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపఽథ్యంలో అందుకు సంబంధించి ఏర్పాట్లను బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, ఎస్పీ సతీష్‌ కుమార్‌, సంయుక్త కలెక్టర్‌ ఎ.భార్గవ్‌ తేజ కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించి సభా స్థలి ఏర్పాట్లు, బార్‌ కోడింగ్‌, వాహనాల పార్కింగ్‌, సీటింగ్‌, తాగునీరు, పారిశుద్ధ్య పనులు తదితర నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్‌ చర్చించారు. పలు సూచనలు జారీ చేశారు. గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసరావు, సీపీఓ శేషశ్రీ, డీపీఓ నాగసాయి కుమార్‌, పీడీ డ్వామా శంకర్‌, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ అమర్తలూరి శ్రావణ్‌ బాబు, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ఎంపీడీఓ శిల్ప, తుళ్లూరు తహసీల్దార్‌ సుజాత,అధికారులు పాల్గొన్నారు.

శాకంబరి ఉత్సవాలు

ప్రారంభం

నగరంపాలెం: స్థానిక అమరావతిరోడ్డు హిందూ ఫార్మసీ కళాశాల ఎదురు వీధిలోని శాకంబరి పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో బుధవారం శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కాయగూరలతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారికి ఆలయ ప్రధానార్చకులు శ్రీకాంతశర్మ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విచ్చేసి, అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈనెల 11 వరకు అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.

జలవిద్యుత్‌ కేంద్రాన్ని

సందర్శించిన సీఈ

విజయపురి సౌత్‌: నాగార్జునసాగర్‌ కుడి కాలువ జలవిద్యుత్‌ కేంద్రాన్ని శ్రీశైలం ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ చీఫ్‌ ఇంజినీర్‌ జి.తిరుమల ప్రసాద్‌ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. శ్రీశైలం క్రస్ట్‌ గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల జరుగుతుండటంతో కుడి జలవిద్యుత్‌ కేంద్రంలో పవర్‌ జనరేషన్‌కు సిద్ధంగా ఉండాలని సూచించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జెన్‌కో క్వార్టర్స్‌ను పరిశీలించారు. సీఈ తిరుమల ప్రసాద్‌ను జెన్‌కో అధికారులు ఘనంగా సత్కరించారు. కుడి జలవిద్యుత్‌ కేంద్రం ఈఈ సీహెచ్‌ అప్పాజీ, సివిల్‌ ఎస్‌ఈ కె.వెంకటరమణ, సివిల్‌ ఈఈ సుబ్రహ్మణ్యం, 327 యూనియన్‌ సెక్రటరీ బి.సూరజ్‌చంద్‌, అధ్యక్షుడు ఎం.సాంబశివ, ఎన్‌.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

అమరేశ్వరుని ఆదాయం రూ.27.09లక్షలు

అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత నాలుగు నెలలుగా హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. కోటప్పకొండ దేవస్థానం సహాయ కమిషనర్‌ చంద్రశేఖరరావు పర్యవేక్షణలో దేవాలయంలోని 10 హుండీలను తెరచి అందులో ఉన్న నగదును లెక్కించారు. ఈఓ రేఖ మాట్లాడుతూ హుండీల ద్వారా రూ.26,32,499లు, అన్నదానం హుండీల ద్వారా రూ.75,596లు, మొత్తం రూ.27,09,095లు ఆదాయం వచ్చిందన్నారు. దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

రేపు వెలగపూడిలో  ప్రపంచ జనాభా దినోత్సవం 1
1/2

రేపు వెలగపూడిలో ప్రపంచ జనాభా దినోత్సవం

రేపు వెలగపూడిలో  ప్రపంచ జనాభా దినోత్సవం 2
2/2

రేపు వెలగపూడిలో ప్రపంచ జనాభా దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement