జగనన్న చిత్రపటానికి క్షీరాభిషేకం
తాడికొండ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే అన్ని వర్గాలకు సమన్యాయం సాధ్యమైందని వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ అదనపు సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో వలంటీర్లుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం జీవన భృతి పింఛన్లు శుక్రవారం మంజూరు చేసింది. దీంతో వలంటీర్లు, నాయకులతో కలసి దిగంవత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
సురేష్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి జీవన భృతి పింఛన్లు అందక ఇబ్బందులు పడుతున్న వారి సమస్యను ప్రభుత్వం దృషికి తీసుకెళ్లడంతో తక్షణమే వారికి జీవన భృతి పింఛన్లు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పేదల సంక్షేమం కోసం నిత్యం పరితపించే జగనన్న త్వరలో జీవన భృతి పింఛన్లు రూ.2500 నుంచి రూ.5000 పెంచేలా చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. వీలైనంత త్వరలో రాజధాని ప్రాంతంలోని రైతు కూలీలు తీపి కబురు వినబోతున్నారన్నారు.