రైతు సమక్షంలో నష్టం అంచనా వేయాలి
ఉద్యాన పంటలు, వరి తుపాను కారణంగా నష్టపోయాయి. అధికారులు నష్టాలు అంచనా వేస్తున్నా సమయంలో రైతులను కూడా అధికారులతో పాటు భాగస్వాముల్ని చేయాలి. రైతులందరికీ న్యాయం జరగాలంటే అధికారులతో రైతులు ఉండాలి.
– సున్నా వెంకటరావు, ఏపీ రైతు సంఘం కార్యదర్శి
ఈ సంవత్సరం 4 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఇంతవరకు రూ.2 లక్షలు ఖర్చు చేశాను. తుపాను, ఈదురు గాలుల దెబ్బకు మొక్కజొన్న కంకులు విరిగిపోయి నీళ్లలో నాను తున్నాయి. ఖరీఫ్లో మొక్కజొన్న పంటకు బీమా లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే అప్పుల్లో కూరుకుపోతాం.
– గురజాల రమేష్, రైతు,
కనసానపల్లి, ఆగిరిపల్లి మండలం
రైతు సమక్షంలో నష్టం అంచనా వేయాలి


