
పెద్దింట్లమ్మా చల్లంగా చూడమ్మా
కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ చల్లని దీవెనలు అందించమ్మా.. అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాలు, విరాళాలు, వాహన పూజల ద్వారా మొత్తం రూ.65,580 ఆదాయం వచ్చిందని తెలిపారు.