
కనీస మరమ్మతులు లేవు
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ఇప్పటి వరకూ ప్రధాన రహదారులకు కనీస మరమ్మతులు కూడా లేవు. గోపాలపురం నియోజకవర్గంలోని రహదారులు మరీ దారుణంగా ఉన్నాయి. యర్నగూడెం – పొంగుటూరు రోడ్డుపై పడిన గోతులు చెరువులను తలపిస్తున్నాయి. మెట్ట ప్రాంతంలోని ప్రధాన రహదారులు, గ్రామీణ లింకు రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలి.
– గడా జగదీష్, వైఎస్సార్ సీపీ
జిల్లా అధికార ప్రతినిధి
రోడ్లపై వెళ్లాలంటే భయమేస్తోంది
మెట్ట ప్రాంతంలోని రోడ్లపై వెళ్లాలంటే భయమేస్తోంది. ఏ రోడ్డు చూసినా గోతుల మయంగా ఉన్నాయి. వర్షాలకు మరింత అధ్వానంగా ఉన్నాయి. పొంగుటూరు – యాదవోలు మధ్య రోడ్డు పూర్తిగా దెబ్బ తింది. ఈ రోడ్డుపై ప్రయాణం ఇబ్బందికరంగా ఉంది. దీని నిర్మాణం వెంటనే చేపట్టి పూర్తి చేయాలి.
– ఎలికే నాగ శ్రీనివాస్,
యాదవోలు, దేవరపల్లి మండలం