చేతబడి చేస్తోందని యువతిపై దాడి
పర్లాకిమిడి: పరలా వీధిలో నివాసముంటున్న దమయంతి నాగవంశ చేతబడి చేస్తోందని సందేహిస్తూ సుభాష్నగర్ వాసులు ఆమె ఇంటిపై శుక్రవారం రాత్రి దాడిచేశారు. ఇంట్లోని ఫర్నిచర్, మోటారు సైకిల్ను పెట్రోలు పోసి తగులబెట్టారు. దీంతో భయపడిన దమయంతి ఇంటినుంచి పారిపోయింది. శనివారం ఉదయం ఆదర్శ పోలీసుస్టేషన్కు వచ్చిన దమయంతి ఫిర్యాదును ఐఐసీ వివేకా నంద స్వయికి అందజేశారు.