ధర్మవరంలో దారుణం.. రెండేళ్ల కూతురి గొంతు కోసి..

Woman Slits Daughters Throat And Trying Take Own Life - Sakshi

సాక్షి, అనంతపురం : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కూతురి గొంతు కోసి ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ధర్మవరంలో శుక్రవారం చోటుచేసుకుంది. ధర్మవరం పట్టణంలోని కొత్తపేటకు చెందిన మీనాక్షి అనే మహిళ కూతురు ప్రణతి(2) గొంతుకోసి చంపింది. అనంతరం చెయ్యి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. మీనాక్షిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top