కన్నకూతురిపై లైంగిక దాడి, భార్య హత్య: నిందితుడికి ఉరిశిక్ష

TN Man Sentenced To Death Over Molested Daughter Eliminate Wife - Sakshi

మానవమృగానికి ఉరిశిక్ష 

టీ.నగర్‌ : కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడవద్దని హెచ్చరించిన భార్యను హతమార్చిన మానవ మృగం మురుగేశన్‌ (54)కు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. వివరాలు.. పుదుకోట్టై సమీపంలోని తేనిపట్టికి చెందిన రైతు మురుగేశన్‌కు ముగ్గురు భార్యలు, పదకొండు మంది పిల్లలు ఉన్నారు. రెండో భార్య భానుమతి కుమార్తె(17)పై మురుగేశన్‌ లైంగికదాడికి పాల్పడేవాడు. అడ్డుచెప్పిన భార్య తలపై రాయికొట్టి హత్య చేశాడు. కేసును విచారించిన పుదుకోట్టై మహిళా కోర్టు నిందితుడికి ఉరిశిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. 

చదవండి: స్నేహితులతో కలిసి కన్న కూతురిపై అకృత్యం: 60 ఏళ్ల జైలు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top