లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురి మృతి
సిద్ధిపేట: ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగిఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మంచిర్యాల జిల్లా తాండూరుకు చెందిన వారు. మృతిచెందిన వారిని తాండూరు సర్పంచ్ అంజిబాబుతో పాటు సాయికృష్ణ, గణేశ్లుగా గుర్తించారు.