Hyderabad: ఘోర రోడ్డుప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గరు మృతి

Three Deceased in Petbasheerabad Road Accident Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పేట్‌ బషీరాబాద్‌ పీఎస్‌ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గుర్తుతెలియని వాహనం ద్వి చక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో భార్య భర్తలతో పాటు కూతురు మృతి చెందింది. దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

చదవండి: (అతనితో సన్నిహిత సంబంధాలు.. ఐజీపై సస్పెన్షన్‌ వేటు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top