కారు బీభత్సం: నలుగురు మృతి

Speeding Car Rams Into Footpath People 4 Eliminated - Sakshi

ముంబై : నగరంలో కారు బీభత్సం సృష్టించింది. ఫుట్‌పాత్‌పై ఉన్న జనంపైకి దూసుకెళ్లటంతో నలుగురు మృత్యువాతపడగా మరి కొంతమంది గాయాలపాలయ్యారు. ఈ సంఘటన ముంబైలోని క్రాఫోర్డ్‌ మార్కెట్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివవారల మేరకు.. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో కొలంబో జంక్షన్‌లోని కేఫ్‌ జనతా వద్ద గల ఫుట్‌పాత్‌పై ఉన్న 12 మందిపైకి కారు అదుపుతప్పి దూసుకువచ్చింది. కారు వేగంగా వారిని ఢీకొట్టడంతో నలుగురు గాల్లోకి ఎగిరారు. ( మహిళ మంటల్లో కాలుతున్నా పట్టించుకోకుండా..)

వారిలో ఓ వ్యక్తి కారుపై పడి అక్కడికక్కడే ప్రాణాలు విడవగా మరికొందరు రెస్టారెంట్‌లోకి ఎగిరిపడి మరణించారు. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ సమీర్‌ ఇబ్రహీంకు కూడా గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు 60 ఏళ్లు పైబడిన మహిళలు ఉండటం గమనార్హం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగినపుడు సమీర్‌ తాగున్నాడా? లేదా? అ‍న్నది తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. (వెరైటీ దొంగ; ఆటోడ్రైవర్ల ఫోన్లు మాత్రమే దొంగిలిస్తాడు!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top