కన్నతండ్రి హత్యకే సుపారీ ఇచ్చిన కొడుకులు
బెంగళూరు : కలబుర్గిలో కుటుంబ కలహాలతో కన్న తండ్రినే సుపారి ఇచ్చి హత్య చేయించిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం కలబుర్గి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రవి హనిశెట్టి(29), శరణప్ప హనిశెట్టి (28) అనే అన్నదమ్ములు తమ తండ్రి ఓంకార్ హనిశెట్టి(52)ని చంపడానికి అమర్ హిందోడిగి(35), హరీశ్(33), ప్రహ్లాద్ (30), సురేష్(45)లకు కిరాయి ఇచ్చారు. ఈ నెల 23న అష్టగి వద్ద ఓంకార్ ద్విచక్ర వాహనంలో వెళుతుండగా దుండగులు ఆయనను అడ్డగించి కింద పడేసి తలపై బండరాయితో బాది హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కలబుర్గి పోలీసులు దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకున్నారు. ఆస్తి గొడవలే కారణమని తెలిసింది.