ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
గువాహటి: అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. పతర్కండిలోని లొంగాయ్ టీ గార్డెన్కు చెందిన కొందరు ఛాత్ పూజ కోసం వెళ్లి ఆటోలో వస్తుండగా అస్సాం–త్రిపుర హైవేపై బైతఖల్ వద్ద సిమెంట్ లోడుతో వస్తున్న ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే చనిపోగా, ఒకరు ఆస్పత్రిలో కన్నుమూశారు.
మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పరారైన ట్రక్కు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు.