రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

Road Accident In Krishna District - Sakshi

సాక్షి, కృష్ణా: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం బాపులపాడు మండలం బొమ్ములూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని కారు ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలస్తున్నారు.  భీమవరంలో వివాహనికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిని.. చీమకుర్తి నాగేశ్వరవు, తాతారావు, కనకదుర్గ రావులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top